కామారెడ్డిలో కేసీఆర్కు బ్రహ్మరథం.. సీఎంకే ఓటేస్తామని పది పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం
కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్ కు ఆ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పది గ్రామాలు ఆయనకే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించాయి.
కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన సీఎం కేసీఆర్కే ఓట్లు వేస్తామంటూ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో ఉన్న ఎల్లంపేట, అంకిరెడ్డిపల్లి, నడిమి తండా, వెనుక తాండ, బోడగుట్ట తండా, మైసమ్మ చూరు, రాజకన్ పేట్, వడ్డెర గూడెం, గుంటి తండా, దేవునిపల్లి గ్రామపంచాయతీలు సీఎం కేసీఆర్కే ఓటేసి, ఆయన్ను గెలిపిస్తామని ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. శనివారం మాచారెడ్డి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఆమెను కలిసి తీర్మాన తీర్మానాలు చేశారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు, కార్యకర్తలు రావడం ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు గజ్వేల్తోపాటు కామారెడ్డిలోనూ సీఎం కేసీఆర్ పోటీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో రెండు నియోజకవర్గాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నూతన ఉత్సాహం వచ్చింది. సీఎం కేసీఆర్ కామారెడ్డి రావడంతో కేవలం కామారెడ్డి జిల్లాకే కాక ఉమ్మడి నిజామాబాద్తోపాటు పొరుగున ఉన్న నాలుగైదు జిల్లాల అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగేందుకు తాను విశ్వసిస్తున్నానని స్పష్టం చేశారు.
కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయడాన్ని నిజామాబాద్ బిడ్డగా తాను స్వాగతిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అందరిలాగే తనకూ ఉత్సాహంగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తోందని, ఏకగ్రీవ తీర్మానాలు చేసిన పది గ్రామాల ప్రజలకు కవిత ధన్యవాదాలు తెలిపారు. కారుకు ఎదురు లేకుండా సాగిపోయేలా 10 గ్రామ పంచాయతీల ప్రజలు ఉత్సాహాన్ని ఇచ్చారు. ఇదే ఉత్సాహం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఉండేదని చెప్పారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే మరింత అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో గంప గోవర్ధన్ కేసీఆర్ను ఆహ్వానించారని వివరించారు.
పార్టీలకు అతీతంగా మాచారెడ్డి గ్రామపంచాయతీలు తీర్మానం చేశాయని, షబ్బీర్ అలీ వంటి వారు ఎన్ని మాట్లాడినా సీఎం కేసీఆర్ను పార్టీలు, కులాలు, మతాలకతీతంగా చూస్తారని తేల్చి చెప్పారు. కామారెడ్డిలోని సబ్బండ వర్గాల ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ బోళా శంకరుడు అని, ఆయనకు ఆయనకి ఎముకంటూ ఉండదని, కాబట్టి కామారెడ్డి తో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ గెలుపుకు అందరూ కృషి చేశారు.
ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ నెల 28న కామారెడ్డిలో భారీ సమావేశంలో తాను కూడా పాల్గొంటానని ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేశారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్న పరిశీలనను వివరించాలని నాయకులకు కార్యకర్తలకు కవిత దిశానిర్దేశం చేశారు. కామారెడ్డి ప్రజలు తమ పౌరుషం చూపేందుకు ఇది సరైన సమయం అని తెలిపారు. గజ్వేల్ కన్నా ఒక్క ఓటైనా ఎక్కువ మెజారిటీ తెప్పించి చూపించాలని అన్నారు.
అవార్డులు వచ్చిన గ్రామపంచాయతీలకు కవిత అభినందనలు తెలిపారు. రాజకీయంగా మనల్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా మన గ్రామాల అభివృద్ధిని ప్రశంసిస్తున్నాయి. మన పల్లెల అభివృద్ధిని చూసి అవార్డులు సైతం ఇస్తున్నదని చెప్పారు. గ్రామాలు, పట్టణాలు బాగుండాలన్న కేసీఆర్ పట్టుదల తోనే అన్నీ సాధ్యమయ్యాయని వివరించారు. కామారెడ్డికి కాళేశ్వరం ప్యాకేజీ 22 ద్వారా నీళ్లు వస్తాయని, సిరిసిల్ల నుంచి కూడా నీటిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, కార్పొరేషన్ల చైర్మన్లు అయాచితం శ్రీధర్, మఠం బిక్షపతి, మేడే రాజీవ్ సాగర్, మాచరెడ్డి ఎంపీపీ నార్త్ రావు, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం రావ్, మండల పార్టీ అధ్యక్షుడు బాల్ చంద్రం, కామారెడ్డి సీనియర్ నాయకులు తిరుమల రెడ్డి ఉన్నారు.




