*ముస్లిం స్మశాన వాటిక పరిశీలించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ….*
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్, సోనియా గాంధీ నగర్ లో గల ముస్లిం సోదరుల స్మశాన వాటిక స్థలంపై నెలకొన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు స్థానికులతో కలిసి పరిశీలించారు,అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం వాడుకలో ఉన్న ముస్లిం స్మశాన వాటిక స్థలం శాఖతో ఉన్న సమస్యను కలెక్టర్ మరియు వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పుప్పాల భాస్కర్, జనరల్ సెక్రటరీ సిద్ధిక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, మఖ్సూద్ అలీ, బషీరుద్దీన్, దొడ్ల ఆంజనేయులు, ఖలీల్, ఇర్ఫాన్, అక్బర్, షహనాజ్, నగేష్, ఆర్షియా, ఖాసీం బీ, రాణి, స్థానికులు ఉన్నారు.
