బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి ఉత్సవాల సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్
-బిఎస్పీ పాములపర్తి
బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం మార్కుక్ మండలం పాములపర్తి గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులు దుబ్బాసి బాలకిషన్,బాబు ఆధ్వర్యంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ గారు, నియోజకవర్గ ఇంచార్జి లు కొండనోళ్ళ నరేష్ గారు, కెతోజి వినోద్ గారు,విశిష్ట అతిధిలు నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కర్ణాకర్ గారు,కోశాధికారి మొండి కర్ణాకర్ గారు ,కార్యదర్శి కోట మహేందర్ గారు మరియు మార్కుక్ మండల అధ్యక్షులు ఇసకంటి బాబు గారు ,గజ్వేల్ టౌన్ అధ్యక్షులు స్వామి గారు, BVF నాయకులు నాగరాజు, పరమేష్ హాజరు అయ్యారు.గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ ,నరేష్ యువత క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని రాణించాలని, అదే విదంగా పాపన్న గౌడ్ స్పూర్తితో బహుజన రాజ్యంలో విద్య, వైద్యం మరియు క్రీడలకు పెద్ద పీట వేస్తామని అన్నారు.





