వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వరంగల్ ఖమ్మం- జాతీయ రహదారిపై వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును
వెనుక నుండి ఢీకొట్టిన డీసీఎం, డ్రైవర్ మృతి డీసీఎం లో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలకు తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం, ఈ ప్రమాదానికి కారణం డీసీఎం డ్రైవర్ కు నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు… విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి , క్షతగాత్రులను 108 సహాయం ద్వారా ఆసుపత్రికి తరలించారు, చనిపోయిన డీసీఎం డ్రైవర్ వరంగల్ జిల్లా వాస్తవ్యులుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు…
