ప్రాంతీయం

జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్ ను సన్మానించిన గౌడ సంఘం సభ్యులు

130 Views

  1. ఎల్లారెడ్డిపేట, జూలై 23: రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ ను అక్క పెళ్లి గౌడ సంఘం సభ్యులు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శనివారం మండలంలోని బొప్పాపూర్ లోని వారి నివాస గృహంలో జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ ను శాలువాతో సత్కరించినంతరం వారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ గత పది రోజుల నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు ఇల్లు కూలి నిరాశ్రయులైన పేద గౌడన్నలకు సిరిసిల్ల జిల్లాలోని వివిధ మండలాల్లో ఒక్కొక్కరికి ఐదు వేల ఆర్థిక సహాయం అందిస్తూ గౌడన్నలకు భరోసా కల్పిస్తుండడం ఆనందదాయకమన్నారు. పేద కుటుంబంలో ఆర్థిక స్తోమత లేని ఇంటర్ విద్యార్థులకు కళాశాలల్లో ఫీజు చెల్లించడం అభినందనీయమన్నారు. తంగళ్ళపల్లి మండలంలోని బస్సాపూర్ కు చెందిన బీటెక్ విద్యార్థినికి నూతన ల్యాప్టాప్ అందజేసి గౌడ కులస్తుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సామాజిక కార్యకర్త రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులమై అక్క పెళ్లి గౌడ సంఘం తరఫున వారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించామన్నారు. జిల్లాలోని గౌడన్నల సంక్షేమానికి పార్టీలకతీతంగా పాటుపడుతున్న చిదుగు గోవర్ధన్ గౌడ్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నందువల్లనే సంతోషంతో జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించామన్నారు.సన్మాన కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్ గౌడ్, అక్కపల్లి గౌడ సంఘం నాయకులు చెట్కూరి నారాయణ గౌడ్, పరుశురాములు గౌడ్, చిన్న నారాయణ గౌడ్, బిక్షపతి గౌడ్, నాగరాజు గౌడ్, అంజయ్య గౌడ్, లక్ష్మీరాజంగౌడ్, సురేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7