*మృతుని కుటుంబాన్ని పరామర్శ, ఆర్థిక సహాయం అందించిన -మంజులరెడ్డి*
*అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మారపెల్లి రాజయ్య గారు అనారోగ్యంతో మరణించిన విషయం గ్రామస్తులు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి కి తెలపగా ఈరోజు వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులుకి ఆర్థిక సహాయం అందచేశారు.. కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన మంజులరెడ్డి కి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. వీరి వెంట కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మంజులక్క యువసేన సభ్యులు తదితరులున్నారు*
