యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం కైలాసపురంలోని శ్రీ వాసవి బసవలింగేశ్వర రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ ఆశ్రమంలో ఈనెల 21వ తారీఖున జరగబోయే నాగుల పంచమి బోనాల పండుగ మరియు శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఎమ్మెల్సీ యాదవరెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసిన రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి . ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ కాచారం రేణుకా ఎల్లమ్మ దేవస్థానం ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి యాదాద్రి సమీపంలోని కాచారంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయం తో పాటు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం,బసవ లింగేశ్వర ఆలయం నిర్మించి ప్రతి మంగళ వారం భక్తులకు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశ్రమంలో అన్నదానం నిర్వహిస్తూ ప్రజలను భక్తి మార్గం వైపు మల్లె విధంగా కృషి చేస్తున్న వంగపల్లి అంజయ్య స్వామి అభినందనీయుడని అన్నారు




