దౌల్తాబాద్: కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు అన్నారు. బుధవారం మండల పరిధిలోని శేరిపల్లి బందారంలో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ వరకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీమా కోసం పట్టాదారు పాస్ పుస్తకం, రైతు ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు బీమా ఫారానికి జత చేసి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి సునీత, రైతులు పాల్గొన్నారు…




