గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాయపోల్ మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన అయ్యగాళ్ళ లక్ష్మీనరసయ్య, బేగంపేట గ్రామానికి చెందిన తిప్పని ఐలమ్మ ఇల్లు వర్షానికి కూలినట్లుగా తాసిల్దార్ ఉమారాణి తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిధిలారస్థుల ఉన్న ఇళ్లలో ఉండకూడదని గ్రామ ప్రజలకు తెలియజేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలన్నారు. విద్యుత్ స్తంభాలను తాగకుండా దూరంగా ఉండాలన్నారు.




