గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ కౌన్సిలర్ లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య ఒక నిరుపేద వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు వివరాల్లోకి వెళితే పెర్క రాజు తండ్రి బాలయ్య నెల రోజుల క్రితం కొమురవెల్లి దేవస్థానం వెళ్లి వస్తుండగా రాజుకు అతని ఇద్దరు కొడుకులకు యాక్సిడెంట్ జరిగింది.అతని హైదరాబాదులో గాంధీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు కాలు విరిగింది ఆపరేషన్ కూడా జరిగింది హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న మూడవ వార్డ్ కౌన్సిలర్ వరలక్ష్మి కనకయ్య లక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు.ఈ కార్యక్రమంలో స్థానిక మూడో వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీరామ్. మల్లేశం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ టౌన్ బి ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు కదుల్ల ఎల్లేశం, సీనియర్ నాయకులు కోడిమల్ల. కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.




