రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న 1995 బ్యాచ్ కి చెందిన జి.సుధాకర్ అనారోగ్యంతో ఈ రోజు విధి నిర్వహణలో సాయంత్రం మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న ఎస్పి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి సుధాకర్ భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.సుధాకర్ కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.నివాళ్ళు అర్పించిన వారిలో అదనపు ఎస్పీ చంద్రయ్య,ఆర్.ఐ లు కుమారస్వామి,యాదగిరి,టౌన్ సి.ఐ అనిల్ కుమార్,ఉపేందర్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




