మల్లన్నసాగర్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్ ను మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రారంభించారు. కుకునూర్ పల్లి మండలం మంగోల్ గ్రామంలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ తో సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాలకు భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తప్పనున్నాయి అని తెలిపారు





