ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కోనేటి ప్రశాంతి తిరుపతి ల పుత్రిక జ్యోత్న్స వివాహ మహోత్సవం ఈనెల 18 శనివారం రోజున ఉండగా1996-97 ఎస్ ఎస్ సి కి సంబంధించిన బాల్య మిత్రులు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. తమవంతు సహకారం గాతిరుపతి కూతురికి బీరువా, కూలర్ డ్రెస్సింగ్ టేబుల్ ,డబుల్ కాట్ పరుపులు వితరణ చేశారు .ఈ కార్యక్రమంలో మిత్రులు గడ్డం మధు శ్రీరామోజు దేవరాజు ముత్యాల సత్యనారాయణ అశ్వక్ సంపత్ రాజు కొమ్మిశెట్టి శ్రీనివాస్ వంగాల శ్రీధర్ బాల్య మిత్రులు పాల్గొన్నారు.





