రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి, రామారం, వీరారెడ్డిపల్లి, వీరానగర్, అంకిరెడ్డిపల్లి, గొల్లపల్లి, దౌల్తాబాద్ మండలంలోని మాచిన్ పల్లి గ్రామాలలో శుక్రవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ వాసుదేవ్ రావు తెలిపారు. 33కెవి లైన్ మరమత్తు పనుల కారణంగా త్రీఫేజ్ విద్యుత్ ను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరిగి సాయంత్రం 7 గంటల నుండి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఉంటుందని ఆయన తెలిపారు.దౌల్తాబాద్, రాయపోల్ మండలంలోని ప్రజలు ఈ అ సౌకర్యాన్ని గుర్తించి సహాకరించాలని ఆయన కోరారు.
