బోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్
ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 06 :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు కట్టమైసమ్మ , శ్రీ దుర్గా మాతలకు ఈ నెల 8.9.10.11.12 తేదీ లలో నిర్వహించి తలపెట్టిన ప్రతిష్ట మహోత్సవానికి రావాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ను సోమవారం అసెంబ్లీ చాంబర్లో కలిసి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు,
తప్పక వస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి విలేకరుల కు తెలిపారు,




