ప్రజాపక్షం ఎల్లారెడ్డిపేట మండలం లోని దూమల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు “ప్రత్యేక అదనపు తరగతులు” ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా “దుమాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ” సహకారం తో మంగళవారం రోజు పాఠశాలలో ప్రొఫెసర్. బద్దిపడిగే శివారెడ్డి గారు దుమాల ఎంప్లాయీస్ అసోసియేషన్ గారిచే ప్రారంభం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తరగతుల తో విద్యార్థినీ విద్యార్థులు చక్కగా వినియోగించుకొని ఉత్తమ ఫలితాలు సాధంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి పాఠశాలకు, గ్రామానికి , తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని తెలియజేశారు.
ఇందులో ప్రదానోపాద్యాయులు బూర రవీందర్ గారు, SMC చైర్మన్ శ్రీ కె. ఆంజనేయులు, మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
