Breaking News

వర్గల్ మండల్: హరీష్ రావు క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగిస్తున్న తీరు…

112 Views

బావుల దగ్గర విద్యుత్ మీటర్లు పెట్టడం లేదని 12 వేల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ ఇవ్వకుండా కేంద్రం ఆపిందన్నారు*. *బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు 40 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే డబ్బును ఆపేసి రాష్ట్ర ప్రజలను తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు*.

గతంలో యాసంగి పంట అంటే గాలిలో దీపం ఇప్పుడు సంవత్సరానికి గజ్వేల్ రైతులు రెండు పంటలు తీస్తున్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే పరిస్థితి మరోలా ఉండేది. ఏళ్ల తరబడి ఏనాడు మత్తడి దూకని కూడేల్లి వాగు ఇవాళ మత్తడి దూకుతుంది అంటే అది కేసీఆర్ వల్లనే అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు మంత్రి హరీష్ రావు. అంతకుముందు హరీష్ రావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గజ్వేల్ లో క్రైస్తవ భవన్ లో తెలంగాణ ప్రభుత్వం తరపున క్రైస్తవులకు క్రిస్మస్ బట్టలు పంపిణీ, విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు క్రీస్తు సోదరసోదరీమణులందరికీ క్రిస్ట్ మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు మంచిని మంచిగా.. చెడును చెడుగా చూడాలని చెప్పారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం పని చేసే మహా గొప్ప నాయకుడు. సీఎం కేసీఆర్ ప్రతీ పండుగను ఘనంగా జరుపుతున్నారు. సమ్మక్క-సారాలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని కోరినా విస్మరించింది. కానీ సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా జరిపిస్తున్నారన్నారు మంత్రి హరీష్ రావు.తెలంగాణ ప్రజల స్థితిగతులు మార్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ యార్డులో గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్, పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు కేంద్రంపై మండిపడ్డారు.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal