20 Views

i
- మద్యం తాగి వాహనాలు నడపరాదు: ఎస్సై ఎన్.రమేష్ గౌడ్ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం స్థానిక ఎస్సై ఎన్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్ఐ ఎన్ రమేష్ గౌడ్ మండల ప్రజలకు వాహనదారులకు పలు సూచనలు చేశారు.వాహన దారులు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,కార్ మోటార్ వాహనం నడిపేవారు సీటు బెల్టు ధరించాలని అతివేగం ప్రమాదకరమని మద్యం తాగి వాహనం నడప కూడదని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలన్నింటినీ కలిగి ఉండాలని డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు.ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found