ఘనంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవం కేక్ కట్ చేసి,సంబరాలు జరుపుకున్న గంగపుత్రులు.
మంచిర్యాల.
మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పునస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు : నేన్నెల నరసయ్య పట్టణ అధ్యక్షులు: గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న మత్స్యకారుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో అత్యంత వెనుకబడిన కులం గంగపుత్రులే దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గంగపుత్రులకు ఒరగబెట్టింది ఏమీ లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లలకు బదులు నగదు బదిలీ చేయాలని గత 12 సంవత్సరాల నుండి మరణించిన 986 మందికి ఎక్స్గ్రే గ్రేసియా తక్షణమే చెల్లించాలి అర్హులైన మత్స్యకారులు అందరికీ టూవీలర్లు ఫోర్ వీలర్ వాహనాలను 90 శాతం సబ్సిడీతో అందించాలి మత్స్యకార సొసైటీ సభ్యులందరికీ జీవిత భద్రత కల్పించేలా 20 లక్షల ఇన్సూరెన్స్ ఎక్స్ గ్రేషియా అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. పట్టణ యూత్ అధ్యక్షులు మంచెర్ల సదానందం శాఖపురం భీమ్సేన్. గగ్గూరి రాజన్న. మనోహర్,రాజన్న తదితరులు పాల్గొన్నారు.





