79 Views
- ముస్తాబాద్, మే 31 (24/7న్యూస్ ప్రతినిధి): గూడెం గ్రామంలో అనాథలకు, నిరాశ్రయులకు, వృద్ధులకు అన్నదానం చేయడం అత్యంత పుణ్యప్రదమైన కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ నిలిచిన మహిళలకు సన్మానాలు జరిగాయి. అడగనిదె అమ్మయినా అన్నంపెట్టని ఈ రోజుల్లో మహిళలే వృద్ధులు, వికలాంగులపై మక్కువ పెంచుకొని వృత్తులు సైతం విస్మరించి అన్నపూర్ణ ఫౌండేషన్ నామకరణం చేసి ఎంతోమంది అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ అనాథలకు, నిరాశ్రయులకు, వృద్ధులకు అన్నదానం
చేయడం అత్యంత పుణ్యప్రదమైన కార్యం అన్నారు. ఈ సందర్భంగా కుర్ర సావిత్రితో పాటు తోటి మహిళలు మాట్లాడుతూ పాత్రికేయులు మాసేవలను సమస్యలను సమాజానికి ప్రభుత్వానికి చేరవేస్తున్న జర్నలిస్టులపాత్ర ఎంతో కీలకమని అన్నారు. వీరి సేవలను ప్రశంసిస్తూ అధిరోహించాలని మాసేవలను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అన్నపూర్ణ ఫౌండేషన్ తరపున పాత్రికేయ మిత్రులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ సన్మాన కార్యక్రమం ద్వారా సమాజంలో సేవాకార్యక్రమాలు చేసేవారిని ప్రోత్సహిస్తూ మానవ సేవే మాధవసేవ అనే నినాదంతో అన్నపూర్ణ ఫౌండేషన్ వారు వారి సేవలను అందిస్తున్నామని తెలిపారు. మరెందరో దాతలు ముందు వరసలో నిలబడితే మేము మరింత సులభంగా సేవలందిస్తామని కోరుకుంటున్నాము అన్నారు.
No Slide Found In Slider.
Poll not found