
ఘనంగా సత్యాన్నబోనం సమర్పణ
ముచ్చర్లలో రేణుకా ఎల్లమ్మ సిద్ధోగం వేడుక…
మంగళవారం జరుగనున్న రేణుకా జమదగ్ని మహర్షిల కళ్యాణ వేడుక
- TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణ వేడుక ( సిద్దోగం) లో భాగంగా సోమవారం డప్పు చప్పుల మధ్య దాయితమ్ముళ్ళ ఆటపాటలతో ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.అందులో భాగంగా ప్రముఖ కళాకారులు రాజేశం గౌడ్ బృందం నిర్వహించిన అమ్మవారికి సత్యాన్న బోనం సమర్పణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం రోజున జరగనున్న రేణుకా జమదగ్ని మహర్షిల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ముచ్చర్ల గౌడ సంఘ సభ్యులు కోరారు.





