ముస్తాబాద్, ఏప్రిల్ 20 (24/7న్యూస్ ప్రతినిధి):ముస్తాబాద్ మండలంలోని నామంపూర్ గ్రామంలో విద్యుత్ ఘాతంతో ప్రమాదవశాత్తు ఉద్యోగికి తీవ్ర

గాయాలు.. నామాపూర్ గ్రామానికి చెందిన యారపు స్వామి తండ్రి పోచయ్య గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ పై పేజ్ డౌన్ అవడంతో ఫేస్ వేయడానికి లైన్ ఆఫ్ చేసి పైకెక్కాడు అంతలోనే విద్యుత్ ఒక ఫేస్ లైన్ సంబంధించిన ఒక్క బ్లేడు నట్టు ఊడిపోయి 11కెవి లైన్ కు పట్టుకుందని గమనించక యధావిధిగా విధులు నిర్వహించే క్రమంలో ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్ లో చేర్పించారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడి హాస్పిటల్లో గోలుకుంటున్నాడు వారితో లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తోటి ఉద్యోగులు ఉన్నారు.




