మందమర్రి పెద్ద మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని పెద్ద మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా హాజరయ్యారు.పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో మంత్రి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి వారికి రమజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాలు, వర్గాల మధ్య సోదరభావం మరియు ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, యువకులు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





