గుగ్గిళ్ల గ్రామ శుద్ధిజల కేంద్ర నూతన కమిటీ ఎన్నిక
సిద్దిపేట జిల్లా, మార్చి1, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో మినరల్ వాటర్ శుద్ధిజల కేంద్ర నూతన కమిటీ నీ ఆదివారం ఏన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా కొంకటి ఆగయ్య,ఉపాధ్యక్షులుగా గుగ్గిళ్ల శంకర్ బాబు,కోశాధికారీగా కుంభం తిరుపతి,నూతన కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మినరల్ వాటర్ నడిపివ్వడానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ యొక్క వాటర్ ఫ్లాంట్ కమిటీ సభ్యులకు గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, గ్రామ పంచాయితీ పాలక వర్గం శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వాటర్ ఫ్లాంట్ కమిటీ సభ్యులుగా నంగునూరు రాజయ్య,చిట్టి గంగయ్య,పోతు రాజమౌళి,ఎండి మహబూబ్ అలీ{మైబు},సోమ సారయ్య, వేముల శ్రీధర్,నంగునూరు రాజు నీ గ్రామ ప్రజల సమక్షంలో ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల గ్రామ పంచాయితీ పాలక వర్గ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





