ముస్తాబాద్ ఫిబ్రవరి 18 (24/7న్యూస్ ప్రతినిధి) ఈనెల 17న రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన జిల్లా
స్థాయి సీఎంకప్పు ఆటలలో కబడ్డీ ఉమెన్ ఓపెన్ కేటగిరిలో రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ జట్టు మొదటి స్థానంలో గణనీయంగా నిలిచింది. దీనిలో భాగంగా బంధనకల్ విద్యార్థిని హృతిక ప్రియదర్శిని రాష్ట్రస్థాయి కబడ్డీలో పాల్గొనుటకు ఎంపిక కావడంతో ఈ పోటీలు నారాయణపేట జిల్లాలో 20తేదీ నుండి 23వరకు జరగనున్నాయి ఈ పోటీలకు బయలుదేరుతున్న విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్ వ్యాయామ ఉపాధ్యాయులు పరశురాములు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు.




