మంచిర్యాలలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్ షో
ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు దేవేందర్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచందర్రావు.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా ఐబి కేంద్రంలో బిజెపి పార్టీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బిజెపి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దేవేందర్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 11 వ తారీఖున జరగబోయే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి బిజెపి కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్రావు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ మరియు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ మరియు బిజెపి శ్రేణులు , కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





