విద్యావర్ధిని పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో చట్టంపై ఇన్స్పెక్టర్ దుర్గా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం…
సిద్దిపేట జిల్లా,ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీపెరుమాళ్,ఆదేశానుసారం సిద్దిపేట షీటీమ్ సిబ్బంది సిద్దిపేట పట్టణం లోని విద్యావర్ధిని పాఠశాలలో అవగాహన కార్యక్రమాలనునిర్వహించారు.ఈకార్యక్రమాల్లో భాగంగా ఇన్స్పెక్టర్ దుర్గా, మాట్లాడుతూ ఈవ్ టీజింగ్, ఆకతాయిల వేధింపులు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు , పిల్లలకి భరోసా సెంటర్ అందించే సేవల వివరాలు, పోక్సో చట్టం, నేరాలకు విధించే శిక్షలు,కొన్ని కేస్ స్టడీస్ ద్వారా అవగాహనసోషల్ మీడియా లాభాలు, నష్టాలు, విద్య యొక్క ప్రాముఖ్యత,గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ ఇలా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా డయల్ 100, 1098, 1930 హెల్ప్లైన్ నంబర్ల ప్రాముఖ్యతను గురించి కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి , హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ , సుధాకర్ , షి టీమ్ సిబ్బంది , పాఠశాల హెడ్ మాస్టర్ మోహన్ పాల్గొన్నారు.





