మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల లో బిజెపి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని నస్పూర్ బొమ్మరిల్లు హోటల్ దగ్గర నుండి సున్నం బట్టి వాడ, ఓవర్ బ్రిడ్జి , ఐబి చౌరస్తా నుంచి యూటర్ని తీసుకొని శ్రీనివాస టాకీస్ లైన్ నుండి ముకరాం చౌరస్తా, రైల్వే స్టేషన్ రోడ్డు నుండి పోలీస్ స్టేషన్ మీదుగా మార్కెట్ రోడ్డు, అర్చన టెక్స్ మీదుగా వెంకటేశ్వర టాకీస్ వరకు భారీ బైక్ ర్యాలీ బిజెపి కార్యకర్తలతో నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడుస్తున్న ప్రజలకు ఏమి చేయలేదని అదేవిధంగా 6 గ్యారంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేశారని బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథరావు విమర్శించారు.
