ప్రాంతీయం

దుబ్బాక మున్సిపాలిటీ 6 వ వార్డు కౌన్సిలర్ గా ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి చిట్టిపాక జ్యోత్స్న – కనకరాజు ని భారీ మెజారిటీతో గెలిపించండి…

16 Views

దుబ్బాక మున్సిపాలిటీ 6 వ వార్డు కౌన్సిలర్ గా ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి చిట్టిపాక జ్యోత్స్న – కనకరాజు ని భారీ మెజారిటీతో గెలిపించండి…

-ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహరాజ్…

సిద్దిపేట జిల్లా,ఫిబ్రవరి 5, తెలుగు న్యూస్ 24/7

దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆరవ వార్డు కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న ధర్మ సమాజ పార్టీ అభ్యర్థి చిట్టి పాక జ్యోత్స్న, కనకరాజు, తరపున వార్డులో జరిగిన ప్రచార కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా పాల్గొన్నారు. వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటు అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్ మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 6 వ వార్డులో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మద్దతుతో యువ నాయకురాలు చిట్టిపాక జ్యోత్స్న కనకరాజు,ని పోటీలో నిలపడం జరిగిందని అన్నారు. భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి గడపకిచేరాలని, రాజ్యాంగ ఔన్నత్యాన్ని నిరంతరం బోధిస్తూ, అత్యధిక జనాభా కలిగిన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం సమస్త రంగాలలో వాటా దక్కాలని పోరాటం చేస్తూ ఎన్నికల బరిలో నిలిచిన ఉన్నత విద్య కలిగిన నాయకురాలు, పూలే, అంబేద్కర్, కాన్షీ రామ్, ఆలోచనతో ఉద్యమిస్తున్న విశారదన్ మహారాజ్ నాయకత్వంలో పని చేస్తున్న చిట్టిపాక జ్యోత్స్న కనకరాజు నిభారీమెజారిటీతోగెలిపించాలని అన్నారు. ఈ సమావేశం లో పార్టీ జిల్లాప్రధానకార్యదర్శి డి బి రాజు, ఉపాధ్యక్షులు చందు నాయకులుకనకరాజు, ప్రశాంత్,మల్లేశం, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *