మంచిర్యాల డివిజన్ నం 4 లో శెట్టి ప్రవళిక – శంకర్ ల ప్రచారం లో పాల్గొన్న బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం.
మంచిర్యాల జిల్లా.
ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో డివిజన్ నం 4 లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి శెట్టి ప్రవళిక – శంకర్ లను గెలిపించాలని ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ ప్రచారం లో పాల్గొన్న ప్రజలకు ఓటు విలువ చెప్పి కాంగ్రెస్, బి ఆర్ ఎస్, బీజేపీ పార్టీల వల్లనే మన బ్రతుకులు వెనుకబడి పోయాయిన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ తో మన బ్రతుకులు బాగుపడతాయి అని ప్రజలకు చెప్పి 11 వ తేదీ నాడు ఏనుగు గుర్తు కు ఓటు వేసి ప్రవళిక ని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జ్ లు నాగుల కిరణ్ బాబు, దాగం శ్రీనివాస్ పాల్గొన్నారు.





