సర్వంగా సుందరంగ ముస్తాబాయినా శ్రీ సమ్మక్క – సారాలమ్మ గద్దెలు
సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామం లో వెలసిన శ్రీ సమ్మక్క – సారాలమ్మ ల జాతర కీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాతర కమిటీ అధ్యక్షులు ‘మాజీ సర్పంచ్ బోయినపల్లి నర్సింగ రావు,అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క – సారాలమ్మ ల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రతి సారి చేసినట్టే ఈ సారి కూడా వచ్చి పోవు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త లు తీసుకున్నామని, గద్దెల సమీపంలో స్నానాలకు, నీటి సౌకర్యం కల్పించామని, త్రాగునిరు కూడా, ఏర్పాటు చేశామని, అదేవిదంగా జాతరకు వచ్చే భక్తుల వాహనాలకు గాని దర్శనాలకు గాని ఎటువంటి టిక్కెట్లు పెట్టలేదు అని అమ్మవార్ల దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చి ఆ వానదేవతల కృప కు పాత్రులు కావాల్సిందిగా ఆలయ చేర్మెన్ తెలిపారు.





