మంచిర్యాల జిల్లా పద్మశాలి సేవా సమాజం భవనాన్ని ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని ఉషోదయ హై స్కూల్ వద్ద నూతనంగా నిర్మించిన మంచిర్యాల జిల్లా పద్మశాలి సేవా సమాజం భవనాన్ని ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఈ భవనాన్ని ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధి చేస్తానని తెలిపారు .అనంతరం పద్మశాలి సేవా సమాజం సభ్యులు శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా పద్మశాలి సభ్యులు, మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





