పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత – శ్రీనివాస్ చారి
సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7
పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ చారి అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామంలో గజ్వేల్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు జాతీయ సేవా పథకం ( ఎన్ ఎస్ ఎస్) లో భాగంగా గ్రామంలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ చారి మాట్లాడుతూ, గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని గ్రామాల ప్రజలు, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆయన సూచించారు, గ్రామాలలో పరిశుభ్రత,పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని వివరిస్తూ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు





