అయ్యప్ప స్వామి దేవాలయంలో ముగిసిన అన్న ప్రసాద వితరణ
సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రముఖ ఆలయం అయ్యప్ప స్వామి ఆలయంలో గత 41 రోజులుగా ప్రతిరోజు అన్నప్రసాదం,అల్పాహారం దాతల సహకారంతో పంపిణీ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఒక ప్రకటన లో ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి, ఈ సందర్భంగా కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ మాట్లాడుతూ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని,దాదాపు 41 రోజులుగా అల్పాహారం,అన్న ప్రసాదం అందజేసే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు దుర్గం స్వామి, ప్రధాన కార్యదర్శి రవీందర్,కోశాధికారి నారాయణ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, బొగ్గుల సురేష్ స్వామి, కైలాస ప్రశాంత్ గందే సంతోష్, తదితరులు పాల్గొన్నారు





