కెసిఆర్ ఫామ్ హౌస్ ముట్టడి కాంగ్రెస్ నేతలు
సిద్దిపేట జిల్లా, మర్కుక్, జనవరి
మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ధర్నాకు దిగారు కెసిఆర్ అసెంబ్లీ వెళ్లి నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారం పై మాట్లాడాలి లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అసెంబ్లీకి రావా గజ్వేల్ ప్రజలవి ఓట్లు కావా అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ అసెంబ్లీకి ఒక్కరోజు మాత్రమే హాజరై నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించ కుండ ఫామ్ హౌస్ కు వెళ్ళిపోవడాన్ని నిరసిస్తూ ఈ ధర్నా చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.





