గజ్వేల్ నుండి శబరిమలై బయలుదేరిన అయ్యప్ప స్వాములు
అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలి – రేఖా గౌడ్
సిద్దిపేట జిల్లా, గజ్వేల్, జనవరి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయం నుండి శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయానికి బయలుదేరిన అయ్యప్ప స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ జన హక్కుల పోరాట సమితి మొకుదెబ్బ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగొని రేఖా గౌడ్ మాట్లాడుతూ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, అయ్యప్ప స్వామిని దర్శించిన కొలిచిన, పుణ్యం లభిస్తుందని అయ్యప్ప మాల ధారణ శ్రేష్టమని సర్వపాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని 41 రోజులు కఠోరమైన దీక్షతో అయ్యప్ప స్వాములు శబరిమలై చేరుకొని స్వామివారిని దర్శించుకుని రావడం ఒక పవిత్ర కార్యక్రమమని గజ్వేల్ నుండి శబరిమలై క్షేమంగా చేరుకొని లాభంగా తిరిగి రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు దైవభక్తి కలిగి ఉండాలని, దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు





