ప్రాంతీయం

సావిత్రిబాయి పూలే 195 జయంతి వేడుకలు బీఎస్పీ పార్టీ

13 Views

మంచిర్యాల జిల్లా, మందమర్రి
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మందమర్రి పట్టణలో సావిత్రిబాయి పూలే 195 జయంతి ని నిర్వహించిన కార్యక్రమాన్ని మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు దాగం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పూలమాల వేశారు తదనంతరం,జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేనివి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈరోజు అన్ని వర్గాలలో స్త్రీలు ముందున్నారంటే కేవలం ఆనాడు సావిత్రిబాయి పూలే చేసిన పుణ్యమే ఆనాడు కేవలం వంటింటి కె పరిమితమైన స్త్రీలకు చదువు ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ఆడవారికి చదువు నేర్పించిన మహా మూర్తి సావిత్రిబాయి పూలే అలాంటి సావిత్రిబాయి పూలే ని ఈరోజు మనం ఘనంగా వారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు మతిన్ ఖాన్, మందమరి మండల అధ్యక్షులు రహీం బాబా, రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు బొల్లి నరేష్, రవి, తిరుపతి గోపి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *