ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీలోకి కోనాపూర్ ఉప సర్పంచ్ పంచమి రాజు.

22 Views

కోనాపూర్ గ్రామ ఉప సర్పంచ్‌గా ఎన్నికైన పంచమి రాజు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, గ్రామాల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పంచమి రాజు కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా పంచమి రాజు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి, గ్రామ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని విశ్వసించి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ మరింత పెరుగుతోందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, మండల అధ్యక్షుడు పడాల రాములు, తిర్మలాపూర్ సర్పంచ్ బండారు లాలు, గొడుగుపల్లి సర్పంచ్ మద్దెల వనజ, ఆత్మ కమిటీ డైరెక్టర్ సూరంపల్లి ప్రవీణ్, ఏఎంసీ డైరెక్టర్ పడాల మల్లేశం, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పంచమి వినోద్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *