*మంచిర్యాల జిల్లా*
ఈ నెల 29వ తేదీ నుండి ప్రజావాణి యధాతధం
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
డిసెంబర్ 20, 2025:
2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 లో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు ఈ నెల 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నందున అధికార యంత్రాంగం ఆయా పనులలో నిమగ్నమై ఉంటారని, ఈ కారణంగా ఈ నెల 22వ తేదీ సోమవారం రోజున జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేస్తూ ఈ నెల 29వ తేదీ నుండి యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
*మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





