కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి
– అంకిరెడ్డిపల్లి గ్రామాలలో ఓటర్లను ప్రలోభపెట్టినందుకు
– సిద్దిపేట్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు
సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్.
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 8, తెలుగు న్యూస్ 24 /7
ఓటర్లను ప్రలోభ పెట్టె విధంగా గ్రామంలో ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి గాను కొండపాక మండల ఖమ్మంపల్లి అభ్యర్థులైన మంద భాస్కర్ రెడ్డి, తిమ్మాపురం కర్ణాకర్ రెడ్డి లు వ్యవసాయ బావుల వద్ద భోజనాలు వండించి ఓటర్లకు పెడుతున్నారని సమాచారం మేరకు కొండపాక మండల ఫ్లయింగ్ స్కాడ్ టీం ఇంచార్జ్ చెట్లపల్లి బాలకృష్ణ ఫిర్యాదు మేరకు మంద భాస్కర్ రెడ్డి, తిమ్మాపురం కర్ణాకర్ రెడ్డి,కి సహకరించినత్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైనది.అంకిరెడ్డిపల్లి గ్రామంలో 10 వ. వార్డ్ మెంబర్ గా పోటీ చేస్తున్న తాళ్లపల్లి చందన్ తన వార్డ్ సభ్యులను మచ్చిక చేసుకోవడానికి గాను అంకిరెడ్డిపల్లి గ్రామంలో ఎల్లమ్మ తల్లి గుడిలో తన కులస్థులైన 12 మంది వ్యక్తులకు మందు పార్టీ ఏర్పాటు చేసినందున సమాచారం మేరకు కొండపాక మండల ఫ్లయింగ్ స్కాడ్ టీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైనది..





