ప్రాంతీయం

50% సీలింగ్ జీవో పత్రాలను దహనం చేసిన బీసీ సంఘాలు

12 Views

50% సీలింగ్ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో పత్రాలను దహనం చేసిన బీసీ సంఘం నాయకులు.

మంచిర్యాల జిల్లా.

ఈరోజు మంచిర్యాల్ పట్టణంలోని ఐబీ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రిజర్వేషన్లు 50 శాతం దాటద్దని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందో జీవోను జీవో ప్రతులను దహనం చేస్తూ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ సభ పేరుతో బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి బీసీలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాల కాలం అవుతున్న స్పష్టమైన వైఖరి లేకపోవడం బాధాకరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని పరిష్కరించిన పాపాన పోలేదు మభ్యపెట్టి మోసం చేయడం అవుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం బీసీల పక్షపాతి అని చెప్పుకునే బిజెపి 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది ఈ రెండు పార్టీలు ధోరణిని విడనాడి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాంగ్రెస్ బిజెపి పార్టీలను డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదు అలాగే బిజెపి వైఖరిని తీసి సమాజం ముందు ఎండగట్టి బిజెపిని బీసీ ల ముందు దోషిగా నిలబెట్టక తప్పదని హెచ్చరిస్తున్నాం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజెల్లి వెంకన్న, శాఖ పూరి భీమ్సేన్, చంద్రగిరి చంద్రమౌళి, కర్రె లచ్చన్న, వేముల అశోక్, కీర్తి బిక్షపతి, మంచిర్ల సదానందం మరియు తన్నీరు భీమ్రావు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *