నేటితో వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తి
సిద్దిపేట జిల్లా, నవంబర్ 7
నేటితో వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెయింట్ విన్సెంట్ పాఠశాలలో సామూహిక గీతాలాపన తో పాటు మన దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకుంటూ చిన్నప్పటినుండి విద్యార్థులు దేశభక్తిని అలవర్చుకొని దేశ సేవలో వారందరు భాగస్తులు కావాలని ఆకాంక్షిస్తూ స్వాతంత్య సమరంలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో బకిం చంద్ర ఛటర్జీ రాసిన గేయం ముఖ్య భూమిక పోషించి బ్రిటీషువారి వెన్నులో వణుకు పుట్టించడమైందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ జానెట్ తెలపడం అయినది. ఇట్టి కార్యక్రమంలో సిస్టర్ అలీన, సిస్టర్ స్టెఫీ, ఉపాద్యాయులు కరుణాకర్, రమేష్,పి.ఈ.టీ. శ్రీకాంత్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.





