ప్రాంతీయం

42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలి, బి ఎల్ పి

49 Views

42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలి, బి ఎల్ పి

సిద్దిపేట జిల్లా, నవంబర్ 6

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ( బి ఎల్ పి )పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు తలారి ప్రవీణ్ మాట్లాడుతూ బిసిలకు 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు)బిఎల్పిరాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఈరోజు బి ఎల్ పి జిల్లా కమిటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందచేయటం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 2025లో బిసి కులాల ప్రజలకు విద్య,ఉద్యోగ, స్థానిక సంస్థల్లో42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులను ఆమోదించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ లకు పంపి7 నెలల అవుతున్న కేంద్ర ప్రభుత్వం వద్ద గత 7 నెలలుగా పెండింగ్ లోనే ఉన్నదన్నారు.

ఈ నేపథ్యంలో రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిసి బిల్లులను 9వ షెడ్యూల్ లో చేర్చందకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, బహుజన లెఫ్ట్ పార్టీ- బిఎల్ పి రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ లకు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ కింద పేర్కొన్న విధంగా డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని పంపాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు.1. కేంద్ర ప్రభుత్వం వద్ద 7 నెలలుగా పెండింగ్ లో 42% బిసి కులాల ప్రజలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చి పార్లమెంట్ లో చట్టం చేయాలి 2. 42% బిసి కులాల రిజర్వేషన్లలో ఏ.బి.సి.డి,ఈ వర్గీకరణతో చట్టం చేయాలి 

3. కామారెడ్డి బిసి డిక్లరేషన్ ప్రకారం సంవత్సరానికి రూ 20 వేల కోట్ల బిసి కులాల ప్రజల విద్య ఉద్యోగ ఉపాధి కోసం రెండు సంవత్సరాలకుగానూ వెంటనే 40,000 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలి

4. రాష్ట్రంలోని నిర్మాణ రంగం తోపాటు అన్ని రకాల ప్రభుత్వ కాంట్రాక్టులలో బిసి కులాల ప్రజలకు వర్గీకరణతో కూడిన 42% రిజర్వేషన్లు అమలు చేయాలి

5. రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పదవుల్లో 90% బిసి,ఎస్సీ, ఎస్టీల తోనే భర్తీ చేయాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ పి పార్టీ ఉపాధ్యక్షులు కోటగిరి ఆంజనేయులు, నాయకులు దబ్బెట ఆనంద్, శివరాత్రి శ్రీనివాస్, దబ్బెట భగవాన్, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *