కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్.
మంచిర్యాల జిల్లా.
భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఈరోజు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లో మర్యాదపూర్వకంగా కలిసి వేమనపల్లి మండల బిజెపి అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కేసు పురోగతి పై బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించడం జరిగింది. అనంతరం వారిని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి మాజీ జిల్లా ఉపాధ్యక్షులు రాపర్తి వెంకటేశ్వర్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.





