ప్రాంతీయం

పోలీసు విధులపై ప్రత్యక్ష అవగాహన

15 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*విద్యార్థుల కోసం రామగుండం కమీషనరేట్ పోలీస్ ఓపెన్ హౌస్.

*పోలీసు విధులపై ప్రత్యక్ష అవగాహన*

*విద్యార్థుల ను ఆకట్టుకున్న డాగ్ స్క్వాడ్ ప్రదర్శన*

*సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త ఉండాలి.*

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల డిసిపి భాస్కర్ ఐపిఎస్ ., పెద్దపల్లి డిసిపి కరుణాకర్ లతో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు.

విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంచేందుకు గోదావరిఖని పట్టణంలో ని వివిధ కళాశాల, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు దాదాపు 1000 మంది ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులకు ప్రజా రక్షణ, భద్రత సంబందించిన పోలీసు చట్టాల గురించి, పోలీసు విధులపై, షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టం గురించి ఫింగర్ ప్రింట్ డివైస్ ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాలు స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి, షీటీమ్, భరోసా, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్, తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.

*ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ* పోలీస్ అమరవీరుల త్యాగాల సంస్మరణ వారోత్సవాల లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్లు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా ఈరోజు కమిషనరేట్ హెడ్ క్వార్టర్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, పోలీసులు కేవలం నేరస్థులను పట్టుకోవడానికే కాదు, సమాజంలో శాంతి భద్రతలు, చట్టపరమైన అవగాహన పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ప్రతి విద్యార్థి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, సమాజంలో భద్రత ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవాలని సూచించారు. దీనిలో విద్యార్థిని విద్యార్థులకు ప్రజల రక్షణ, భద్రత, మహిళ భద్రత, నేరాల నియంత్రణ నేరస్థుల పట్టుకోవడం కోసం పోలీసులు చేస్తున్న విధుల గురించి అవగాహనా కల్పించడం జరిగింది. అదేవిదంగా ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరాలు సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో,సైబర్ నేరం జరగగానే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ల గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది అన్నారు. పోలీసు చట్టాలు పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రాంగ్ రూట్లో వస్తే ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి హెల్మెట్ పెట్టుకోకపోతే ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి. తదితర అంశాల గురించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. మరియు బాలికలు మహిళల రక్షణకు ఏర్పాటుచేసిన భరోసా కేంద్రం యొక్క సేవల గురించి షీ టీమ్స్ పని తీరు, ఉండే వివిధ యాప్ ల గురించి అవగాహన కల్పించడం జరిగింది. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి, డయల్ 100, గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది అన్నారు.

స్నిఫర్ డాగ్స్ తమ ప్రతిభతో ఆకట్టుకోగా, విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు. విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంపు, పోలీస్ వ్యవస్థపై సానుకూల దృక్పథం కలిగించే లక్ష్యంతో కమీషనరేట్ పోలీస్ చేపట్టిన ఈ ఓపెన్ హౌస్ విద్యార్థులను ఉత్సాహపరిచింది.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్, ఆర్ ఏ సి పి ప్రతాప్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి, రామగుండము సి ఐ ప్రవీణ్ కుమార్ , కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ రాం ప్రసాద్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ గౌడ్ , ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ ఐ లు దామోదర్ శ్రీనివాస్, వామన మూర్తి, శేఖర్, మల్లేశం, సంపత్,షీ టీమ్స్ ఎస్ ఐ లు , రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు పోచలింగం, ఆర్ ఎస్ ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *