మంచిర్యాల జిల్లా.
మధుకర్ మరణానికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలీ.
భీమారం ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్ గౌడ్ జిల్లా ప్రధానకార్యదర్శి చెన్నూర్ కంటిస్టేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ పిలుపుమేరకు భీమారం మండలం కేంద్రంలో భీమారం మండల అధ్యక్షులు బోర్లకుంట శంకర్ మాట్లాడుతూ వేమనపల్లి అధ్యక్షుడు ఏట మధుకర్ మరణానికి కారకులైన వారిని ఏదైతే సూసైడ్ లేకలో పేర్లు ఉన్న ముగ్గురు కాంగ్రెస్ నాయకులను వెంటనే శిక్షించాలని కాంగ్రెస్ నాయకులకు సహకరించి ఏక పక్షంగా వ్యవహరించి ఎస్,ఐ ని వెంటనే సస్ పెండు చేయాలని డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా ఏట మధుకర్ ఆత్మ శాంతి చెందాలని బీజేపి నాయకులు మౌనం పాటించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు వేల్పుల రాజేశం యాదవ్, మాడెం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సెగ్గం మల్లేష్, మహిళ మోర్చా అధ్యక్షురాలు మేడి విజయ, శక్తి కేంద్రం ఇన్చార్జులు కొమ్ము కుమార్ యాదవ్, వేల్పుల సతీష్, ఓబిసి నాయకుడు ఆవిడ సురేష్, మరియు నాయకులు గాలి పెళ్లి భూషణ్, పాల్గొనడం జరిగింది. జోహార్ ఏట మధుకర్ జోహార్.





