Breaking News

మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎంపీ

24 Views

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ.

న్యూయార్క్, అక్టోబర్ 2025:
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల (United Nations General Assembly) కోసం అమెరికా పర్యటనలో ఉన్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు  గడ్డం వంశీ కృష్ణ , న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీ కృష్ణ  మాట్లాడుతూ – “అహింస, శాంతి, సత్యం అనే విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహాత్మా గాంధీ ఆలోచనలు నేటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకాలు” అని పేర్కొన్నారు. భారతదేశ ప్రతినిధిగా ఐక్యరాజ్యసమితిలో పాల్గొనడం గర్వకారణమని, దేశం కోసం పని చేసే దిశగా తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భారతీయ ప్రతినిధులు మరియు ప్రవాస భారతీయులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి, గౌరవభావాలతో నిర్వహించబడింది.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *