సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని దుర్గాభవాని ఆలయంలో నవరాత్రుల సందర్భంగా చాముండేశ్వరి అవతారంలో కొలువు దీరిన దుర్గాభవానిమాత పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శ్రీ సంభారపు నాగరాజు స్వాతి, ముత్యంగారి యాదగిరి లత, ప్రత్యేక పూజల్లో పాల్గొని దుర్గామాత ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో నరేష్ గౌడ్, సంభారపు ఆనంద్ , సతీష్, అది మహేష్ తదితరులు పాల్గొన్నారు.





