జగదేవపూర్ : మండల కేంద్రంలో రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరుతూ జాతీయ రహదారి 200 మందికి పై ధర్నాకు దిగారు. ఈ క్రమంలో రైతులు వేకువజామునే సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకోగా యూరియా బస్తాలు రాలేదు అని తెలియడంతో మూకుమ్మడిగా కలిసి వెళ్ళి ధర్నాకు దిగారు.రైతులకు బాసటగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు.
సీఎం డౌన్ డౌన్ అంటూ రైతులు ఆందోళన చేశారు,
వ్యవసాయ అధికారి అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి మరో రెండు మూడు రోజుల్లో యూరియా వస్తుందని రైతులందరికీ అందించే ఏర్పాటు చేస్తామని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని రైతులకు హామీ ఇచ్చారు.
దీంతో రైతులు ధర్నా విరమించారు.





