Breaking News

భక్తి మార్గం తోనే సమాజం లో శాంతి – మంచిర్యాల ఆర్డీవో

20 Views

మంచిర్యాల.

భక్తి మార్గం తోనే శాంతి, సౌర బ్రాతృత్వం – మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు
భక్తి మార్గం తోనే సమాజం లో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొంటుందని మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లో  వంద ఫీట్ల రోడ్డు లో గల అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గణ నాథునికి మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం 3000మందికి అన్నదాన కార్యక్రమం స్వయంగా వడ్డించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ సమాజం లో ప్రతీ ఒక్కరూ భక్తి మార్గం లో పయనించి సమాజంలో మార్పు తీసుకు రావాలన్నారు అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి నీ అభినందించారు. అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ సమాజ సేవ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో అంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం, డైరెక్టర్ లు, సంస్థ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *